NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 9:26 pm Posted by : NAMASTHE BHARAT

మహాదేవపురంలో రూ.37 లక్షల సీసీ రోడ్ల పనులకు శ్రీకారం

మహాదేవపురంలో రూ.37 లక్షల సీసీ రోడ్ల పనులకు శ్రీకారం

-మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన

-ప్రతి కాలనీకి మౌలిక వసతులే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

-ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

-మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మరిన్ని నిధులు తీసుకొస్తాం

-కుత్బుల్లాపూర్ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్, జూలై 11 ( నమస్తే భరత్ ): గాజులరామారం సర్కిల్ పరిధిలోని మహాదేవపురం డివిజన్‌లో అంతర్గత రహదారుల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. డివిజన్‌లోని పలు కాలనీల్లో సుమారు రూ.37 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాదేవపురం డివిజన్‌లోని అన్ని కాలనీలు, బస్తీలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్న ఆయన, రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రతి కాలనీ సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు బుచ్చిరెడ్డి, మహాదేవపురం జనరల్ సెక్రటరీ ప్రసాద్ దుగ్యాల, ఉపాధ్యక్షులు రంగారావు, జగదీశ్వర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, కమిటీ సభ్యులు మహేశ్వర్ రెడ్డి, దిలీప్ కుమార్, మల్లారెడ్డి, రామకృష్ణారెడ్డి, యాదగిరి చారి, నవీన్ కుమార్, వెంకట్ రెడ్డి, రాము, అక్షర జ్యోతి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఎన్. పూలమ్మ, కాలనీవాసులు, మహిళా సంఘాల ప్రతినిధులు, పలు కాలనీల ప్రముఖులు పాల్గొన్నారు.