ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే పిఆర్టీయూ ధ్యేయం
నమస్తే భారత్ :-మరిపెడ
కీసర రమేష్ రెడ్డి
పిఆర్టీయూ మరిపెడ మండల అధ్యక్షులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే పిఆర్టీయూ ధ్యేయమని పిఆర్టీయూ మండల అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి అన్నారు.2026 సంవత్సర పిఆర్టీయూ సభ్యత్వ ముగింపును పురస్కరించుకొని సభ్యత్వ నమోదును మరిపెడ మండలంలోని సీతారాం పురం,వీరారం,కేజిబివి,మోడల్ స్కూల్,సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ పాఠశాలలో సభ్యత్వ నమోదు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని, ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న పిఆర్సి డీఏలను వెంటనే మంజూరు చేయాలని పెండింగ్ బకాయిలను వెంటనే మంజూరు చేయడానికి పిఆర్టీయూ సంఘం అవిశ్రాంతంగా కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్,గౌరవ అధ్యక్షులు అర్జున్ సంఘ బాధ్యులు సునీల్ కుమార్,రవి,వెంకటయ్య,మధు,హరి,కవిత,శ్రీలత,ఉప్పలమ్మ,అనురాధ,సువర్ణ,సందీప్ కుమార్,రుబీన, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.