NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 10:04 pm Posted by : NAMASTHE BHARAT

గణేష్ నగర్‌లో భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఫలారం బండి ఊరేగింపు

గణేష్ నగర్‌లో భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఫలారం బండి ఊరేగింపు

 

సంప్రదాయాలకు ప్రతీకగా ఘనంగా నిర్వహణ

భక్తులతో కిక్కిరిసిన గణేష్ నగర్, రంగారెడ్డి నగర్

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు

ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, యువత, స్థానికులు

ప్రజల సుఖసంతోషాల కోసం అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు

ఐక్యత, భక్తిభావాన్ని పెంపొందించే పండుగలు: బీజేపీ నాయకులు

కుత్బుల్లాపూర్, ఆగస్టు 12: ( నమస్తే భారత్ ); గణేష్ నగర్‌లో అమ్మవారి ఫలారం బండి ఊరేగింపు కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శరత్, శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా నూతన అధ్యక్షులు గిరి వర్ధన్ రెడ్డితో కలిసి బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా నాయకులు నల్ల జై శంకర్ గౌడ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అదేవిధంగా రంగారెడ్డి నగర్‌లో బీజేపీ రాష్ట్ర ఓబీసీ సెల్ జనరల్ సెక్రటరీ నందనం దివాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి ఫలారం బండి ఊరేగింపు కార్యక్రమంలోనూ నల్ల జై శంకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలకు స్థానిక భక్తులు, మహిళలు, యువత, పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అమ్మవారి ఫలారం బండి ఊరేగింపు సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు.

సంప్రదాయాలకు ప్రతీకగా పండుగలు

మన సంప్రదాయాలు, సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే పండుగలు ప్రజల్లో ఐక్యతను, భక్తిభావాన్ని మరింత పెంపొందిస్తాయని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య సోదరభావాన్ని బలోపేతం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమాల్లో కట్ట కుమార్, పులి బలరాం తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి

గణేష్ నగర్, రంగారెడ్డి నగర్ ప్రజలందరిపై అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా నాయకులు నల్ల జై శంకర్ గౌడ్ ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ శుభం కలగాలని ప్రార్థించారు.