NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 10:18 am Posted by : NAMASTHE BHARAT

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి

 

 

నమస్తే భారత్ :-మరిపెడ

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని 9వ వార్డుకు చెందిన ఇంజమూరి కాంతమ్మ ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి కాంతమ్మ మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని, కాంతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ నీలా లచ్చిరాం, కమలాకర్, బాణాల రాజన్న తదితరులు పాల్గొన్నారు .