మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో దోమలు జబ్బు డ్రైనేజీలో గబ్బు
సిపిఎం పార్టీ మండల నాయకులు బాణాల రాజన్న
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో సిపిఎం పార్టీ మండల నాయకులు బాణాల రాజన్న మాట్లాడుతూ మున్సిపాలిటీ కేంద్రంలో డ్రైనేజీలో సక్రమంగా లేక మురుగు నీళ్లు ఎక్కడి ఎక్కడ ఆగి దోమలు విపరీతంగా ఉన్నవి ఇందుమూలంగా అనేక వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాజన్న అన్నారు ఇందుమూలంగా ప్రభుత్వ హాస్పిటల్లో సరి అయిన వైద్యం లేక మందులు అందుబాటులో లేక ప్రైవేటు వైద్యం చేయించుకోలేక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వెంటనే డ్రైనేజీలు సాపు చేస్తూ దోమల బెరదను ఆపుతూ ప్రజలకు కనీస సౌకర్యాలు అందించాలన అనేక వార్డులలో సర్వే నిర్వహించగా ప్రజలు తాము ఇంటి పనులు కడుతున్నప్పటికీ వీధిలైట్లు లేవని కొందరు సిసి రోడ్లు లేవని కొందరు బంగ్లా నటనడిగుడ్డులో బీరువాల జగదీష్ వెనక సందు బజారు కనీసం మట్టి కూడా పోయలేక అక్కడ ఉన్న ప్రజలకు పాములు తేళ్లు భయముతో బిక్కుబిక్కుమంటూ కనీసానికి కరెంటు పోలు కూడా లైట్లు మట్టి రోడ్లు కూడా లేదు ఇలాంటి బజార్లో మైనార్టీ కాలనీలో కూడా రోడ్లు సక్రమంగా లేవు కావున వెంటనే మునిసిపాలిటీ కమిషనర్ మున్సిపాలిటీ సిబ్బంది దాని పరిశీలించి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు అలా చేయని పక్షంలో జనాలని సమీకరించి దశల వారి పోరాటం మున్సిపాలిటీ ఆఫీసు ముందు కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు తాటికొండ అనంత చారి దొంతు మమత అలవాల యాకమ్మ బాణాల ఎల్లయ్య దొంతు సోమన్న భూక్య చంద్రనాయక్ కోటా శ్రీకాంత్ ఓర్సు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు