ePaper
Friday, July 17, 2026
ePaper
Homeఎడిటోరియల్శ్రీరామ్‌నగర్‌కు మరిన్ని మౌలిక వసతులు

శ్రీరామ్‌నగర్‌కు మరిన్ని మౌలిక వసతులు

📰 Generate e-Paper Clip

శ్రీరామ్‌నగర్‌కు మరిన్ని మౌలిక వసతులు

-అభివృద్ధే లక్ష్యంగా పనులు వేగవంతం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

-సూరారం డివిజన్‌లో అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన

-కాలనీ సమస్యలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే

-భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు త్వరలో పూర్తి చేస్తామన్న హామీ

-పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతుల విస్తరణపై దృష్టి

-అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ఆదేశం

-స్థానిక నాయకులు, అధికారులు, కాలనీవాసులతో కలిసి పాదయాత్ర

సూరారం, జూలై 8 ( నమస్తే భరత్ ): ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. 293వ సూరారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో బుధవారం జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి ఆయన పాదయాత్ర నిర్వహించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా కాలనీలో మౌలిక వసతులను విస్తరిస్తున్నామని చెప్పారు. భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి కాలనీని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పాదయాత్ర సందర్భంగా స్థానికులు వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈఈ అనురాగ్, వాటర్ వర్క్స్ డీజీఎం రవి నాయక్, మేనేజర్ రోహిణి, మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు కొండకల్ల శ్రీనివాస్ రెడ్డి, కోల రవీందర్ ముదిరాజ్, సిద్ధిక్, కోల శ్రీకాంత్, హెచ్ఏఎల్ బషీరుద్దీన్, యోగ మల్లేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!