NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 7:42 pm Posted by : NAMASTHE BHARAT

*టిఆర్పి షాద్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎమ్మె సంతోష్ కుమార్*

*టిఆర్పి షాద్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎమ్మె సంతోష్ కుమార్*

నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్02:తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టి ఆర్ పి) షాద్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎమ్మె సంతోష్ కుమార్ ని ఎన్నుకున్నారు. బుధవారం హైదరాబాద్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఎమ్మె సంతోష్ కి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మె సంతోష్ మాట్లాడుతూ…
తీన్మార్ మల్లన్న బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పోరాటాన్ని మెచ్చి పార్టీలో చేరడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు ఆదేశా అనుసారం బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చేవరకు పోరాటం సాగిస్తామని జనాభా ప్రాతిపదికంగా రాజ్యాధికారం ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు నరసయ్య గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు జనార్ధన్, రాష్ట్ర నాయకురాలు వాసుకి, రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి కొందుర్గు మండల అధ్యక్షులు దర్గా వెంకటయ్య, చౌదర్ గూడెం మండల అధ్యక్షులు రాములు, తాలూకా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ, గుండ్ల నవీన్, కాశ యాదయ్య, రామచంద్రయ్య మరియు నాయకులు పాల్గొన్నారు.