NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 7:29 pm Posted by : NAMASTHE BHARAT

మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం.

మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం.
మోడల్ స్కూల్‌లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం.

నమస్తే భారత్ :-మహబూబాబాద్

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులకు సోషల్ టీచర్ యాకూబ్ అవగాహన కల్పించారు.
మట్టి విగ్రహాలు సహజసిద్ధమైనవి కావడంతో నీటిలో సులభంగా కలిసిపోతాయని, పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు 100 విగ్రహాలను తయారు చేసి విద్యార్థులు ఉచితంగా పంపిణీ చేశారు. మట్టి విగ్రహాలను పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాంప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత” అంటూ నినాదాలు చేశారు.
పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, పండుగలను పర్యావరణహితంగా జరుపుకోవాలని పాఠశాల సిబ్బంది సూచించారు.
ఈ కార్యక్రమంలో సోషల్ ఫోరం ఇన్చార్జి ప్రిన్సిపాల్ తాత నాగేశ్వరరావు, యాకూబ్, రంజిత్ కుమార్, శ్రీనివాస్, మరియు విద్యార్థులు పాల్గొన్నారు