NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 8:00 pm Posted by : NAMASTHE BHARAT

మోడల్ స్కూల్ లో ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

మోడల్ స్కూల్ లో ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

మహబూబాబాద్ (నమస్తే భారత్ ) :
మహబూబాబాద్ మోడల్ స్కూల్ లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలను తెలుగు ఉపాధ్యాయులు బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు హాజరై కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాళోజీ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ‘అన్యాయాన్ని ఎదిరిస్తేనే నా ఎదుట మనిషివి’ అని చాటిన గొప్ప మానవతావాది కాళోజీ అని కొనియాడారు. విద్యార్థులు ఆయన స్ఫూర్తితో అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
.