హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో శక్తి జ్యువలర్స్ సౌజన్యంతో షాపూర్ నగర్ డివిజన్ సంజయ్ గాంధీ నగర్లో కుత్బుల్లాపూర్ మండలం,
సాయి లతా మోడల్ హై స్కూల్,2026 వ బ్యాచ్ పదో తరగతి మండల ప్రధమ 593 మార్కులు సాధించిన y.భవ్య లక్ష్మి,అలాగే సాయి తరుణీ మరియు సింధుజలకు అందజేశారు.ప్రపంచ మానవ హక్కుల సమితి డైరెక్టర్ మధుబాబు చికిలే మాట్లాడుతూ కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి అలాగే రాబోయే రోజుల్లో అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవాలి అన్నారు.హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ వ్యవస్థాపకులు తూటే విజయ్ కుమార్ మాట్లాడుతూ మన జీవితాలను మార్చేది చదువే అన్నారు.దాత వీరేందర్ సింగ్ మాట్లాడుతూ ఆర్థిక సమస్యల వల్ల ఎవరి చదువు ఆగిపోకూడదు అన్నారు.కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ దయాకర్,సీనియర్ నాయకులు సయ్యద్ సాజిత్,వెబిట్రిక్స్ సందీప్ బల్లెం,ఉపాధ్యాయ బృందం,తల్లి తండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.