అంగరంగ వైభవంగా పోచమ్మతల్లికి బోనాల సమర్పణ


ఆకట్టుకున్న పోతరాజు విన్యాసాలు
ఖానాపురం ఆగష్టు16 (నమస్తే భారత్ మల్లేష్) :
ఖానాపురం మండల కేంద్రంలో పోచమ్మ తల్లికి భక్తులు బోనం నైవేద్యం సమర్పణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఖానాపురంలో పోతురాజుావిన్యాసాలు, డీజే పాటలు, డప్పు వాయిద్యలతో
శ్రీ పోచమ్మ తల్లి బోనాల జాతర ఎన్నడు లేని విధంగా వైభవంగా సాగింది.
మహిళలు పోచమ్మతల్లికి బోనం నైవెధ్యం సమర్పించి అమ్మవారికి చీరె ,సారె గాజులు , సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురియాలని ,
పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలందరూ పిల్లాపాపలతో సుఖసంతోషంగా ఉండాలని పోచమ్మతల్లిని మొక్కుకున్నారు.బోనాల పండుగలో పోతరాజు విన్యాసాలు,డప్పుచప్పుళ్ళు ,పోచమ్మతల్లి గుడి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు.సర్పంచ్ దాసరి రమేష్ కు పాలకవర్గానికి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.