నరసింహులపేట మండలంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శ
నమస్తే భారత్ :-నరసింహులపేట
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నరసింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి గ్రామానికి చెందిన ఏర్పుల మల్లయ్య ఇటీవల మృతి చెందగా, నేడు వారి నివాసానికి చేరుకున్న మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ధైర్యం చెప్పారు.అనంతరం అదే గ్రామపంచాయతీ పరిధిలోని రూపులతండాకు చెందిన బానోతు కోటియా మరియు బానోతు సూక్య ఇటీవల మరణించగా, వారి నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఇరువురి చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ.ఎమ్మెల్యే.డి.ఎస్.రెడ్యానాయక్ స్థానిక సర్పంచ్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ రవి నాయక్,బండ బిక్షం రెడ్డి మాజీ సర్పంచ్ రేపటి చంద్రారెడ్డి, గొట్టిముక్కుల నరసింహారెడ్డి,బొడ శ్రీను నాయక్, సరిత, కొత్త వెంకటయ్య, వార్డ్ సభ్యులు ఏర్పుల కిరణ్, ఉప్పుటూరి కేతమ్మ, సుబ్బారావు, స్రవంతి, సురేష్, మాజీ యువజన అధ్యక్షులు మండల సురేష్ నాయక్, అందే మధు, ఏర్పుల వెంకటేష్, ఇస్సాంపల్లి అనిల్, గండి మల్లేష్, కొప్పుల వెంకన్న, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు