NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 12:04 pm Posted by : NAMASTHE BHARAT

రేపు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్ అంకిత్

రేపు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్ అంకిత్

నమస్తే భారత్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి)

 

రైతులు ఇంటి వద్ద నుంచే యూరియాను ముందస్తుగా బుక్ చేసుకునే సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ను జిల్లా కలెక్టర్ అంకిత్ రేపు ప్రారంభించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు ఒక ప్రకటన లో తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు తమ మొబైల్ ఫోన్‌లోనే యూరియా అవసరాన్ని నమోదు చేసి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని, బుకింగ్ అనంతరం జారీ అయ్యే బుకింగ్ ఐడీ ఆధారంగా సమీప ఎరువుల విక్రయ కేంద్రంలో యూరియాను పొందవచ్చని తెలిపారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత పెంపొందించడంతో పాటు రైతులకు సకాలంలో యూరియా అందించడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. జిల్లాలోని రైతులందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు కోరారు.