NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 9:30 pm Posted by : NAMASTHE BHARAT

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రంగు మురళి కుటుంబాన్ని పరామర్శించిన

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రంగు మురళి కుటుంబాన్ని పరామర్శించిన

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

నమస్తే భారత్ :-పెద్దవంగర

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కొరిపెళ్లి గ్రామ సర్పంచ్, పెద్దవంగర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రంగు మురళి తల్లి రంగు వినోద ఇటీవల అకాల మరణం చెందగా,మంగళవారం పాలకుర్తి శాసన సభ్యురాలు.యశస్విని రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా దివంగత రంగు వినోద కి నివాళులర్పించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, రంగు మురళి మరియు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ మరియు తాము ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు.