NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 9:41 pm Posted by : NAMASTHE BHARAT

కత్తి వెంకటస్వామి గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి

కత్తి వెంకటస్వామి గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి

వరంగల్ ఆగష్టు13(నమస్తే భారత్ ) :

తెలంగాణ ఉద్యమ సహచరుడు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గౌడ్ సతీమణి కత్తి భవాని మృతి చెందిన విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి మదన్ మోహన్ రావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కత్తి భవాని మృతి పట్ల ఎర్రబెల్లి మదన్ మోహన్ రావు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను కలిసి వారి బాధను పంచుకున్నారు. ఈ సందర్భంగా కత్తి వెంకటస్వామి గౌడ్ , కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.కత్తి భవాని గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరారు.