NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 5:05 pm Posted by : NAMASTHE BHARAT

అంతర్గత రోడ్ల దుస్థితిని పట్టించుకోండి.. వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలి – కొండ ఉప్పలయ్య

అంతర్గత రోడ్ల దుస్థితిని పట్టించుకోండి.. వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలి – కొండ ఉప్పలయ్య

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గ
పరిధిలో మర్రిగూడెం, బోడతండ, పత్తి కుంటతండా, తదితర ప్రాంతాలలో పెండింగ్ లో ఉన్న అంతర్గత రోడ్ల ను అభివృద్ధి చేయాలని సిపిఐ (ఎం) గ్రామ శాఖ కార్యదర్శి కొండ ఉప్పలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గ్రామంలోని పలు ఏరియాలను వారు సందర్శించారు. స్థానికులు ప్రజలు ఫిర్యాదు మేరకు ప్రభుత్వానికి విన్నవిస్తున్నామని ఉప్పలయ్య పేర్కొన్నారు. ముఖ్యంగా పత్తి కుంట తండా గత బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సిసి రోడ్ల అభివృద్ధి జరగకుండా నిర్లక్ష్యం చేశారని ఉప్పలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీ, మర్రిగూడెం ప్రాంతంలో కొన్ని ఏరియాలలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలోనైనా సైడ్ కాలువలు, అంతర్గత రోడ్లు అభివృద్ధి చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు. ఎర్ర వెంకన్న, నందిపాటి వెంకన్న, జిన్నా లచ్చయ్య, సైదులు, కామిడ్ల వెంకన్న, ఉ