సిపిఐ ఆధ్వర్యంలో గార్ల తహశీల్దార్ పరిష్కరించాలని వినతి పత్రం
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టేబోయిన శ్రీనివాస్
నమస్తే భారత్ :-గార్ల
సంవత్సరాల కొద్ది పెండింగ్లో ఉన్న సాధబైన భూముల దరఖాస్తులను పరిష్కరించాలని స్థానికి గార్ల తహశీల్దార్ కి సిపిఐ గార్ల మండల సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టేబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ గార్ల మండలంలో ఉన్న రైతులు సాధబైనమా భూములకు సంబంధించిన దరఖాస్తులను తహసిల్దార్ కార్యాలయంలో.ఇచ్చారు.సంవత్సరాల కొద్దిగా ఆ దరఖాస్తులు అలానే ఉండడం వలన రైతులకు రావాల్సిన.రైతు.బంధు,మొదలకు సౌకర్యాలు రైతులకు అందడం లేదని అన్నారు.కావున వెంటనే ఎవరైతే దరఖాస్తు దారులు ఉన్నారో వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు.లేని ఎడల రైతులందరిని ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ గార్ల మండల కార్యదర్శి జంపాల వెంకన్న, మేదరమెట్ల గిరిప్రసాద్, భూక్య హరినాయక్, అన్నం శ్రీనివాస్, మాగం లోకేష్, మరియు రైతులు బి.రమేష్ ,హనుమంతు తదితరులు పాల్గొన్నారు.