ePaper
Friday, September 4, 2026
ePaper
Homeతెలంగాణస్నేహానికి చిరునామాగా.. మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

స్నేహానికి చిరునామాగా.. మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

స్నేహానికి చిరునామాగా.. మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం 

 

నమస్తే భారత్ :-తొర్రూరు

 

పాఠశాలలో కలిసి చదివిన స్నేహితుడు ఇటీవల అకాలంగా మృతి చెందడంతో స్నేహితులు ఆపన్న హస్తం అందించారు. మండలంలోని అమ్మాపురం శివారు కొత్తగూడెం గ్రామానికి చెందిన యాసారపు కుమార్ ఇటీవల మృతి చెందడంతో ఆయనతో ఏడవ తరగతి వరకు కలిసి చదివిన స్నేహితులు తలో చేయి వేసి ఆర్థిక సాయం అందించారు.

గురువారం మృతుని కుటుంబ సభ్యులకు సదరు మొత్తం అందజేశారు.స్నేహ బంధాలను చిరకాలం గుర్తుంచుకోవాలని, తోచిన మేర చేయూత అందించి కుటుంబానికి అండగా నిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు పాటమ్మ రాంబాబు, నగేష్, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!