అక్రమ రేషన్ బియ్యం దందా పునరావృతం.కఠిన చర్యలు తీసుకోవాలి:
సిపిఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ప్రజా ప్రభుత్వ లో పేద ప్రజలకు అందవలసిన సన్న బియ్యం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడితే మరిపెడ మండలంలో మాత్రం వ్యాపారస్తులకు ఆదాయ వనరులుగా మారింది అధికారులు కొంతమంది ప్రజాప్రతినిధుల అండదండలతో పలుమార్లు రేషన్ బియ్యం బహిరంగంగా దొరకడం దీనిపై అధికారులు ఉదాసీనత వ్యవహరించడం జరుగుతుంది. దీనిపై జిల్లా కలెక్టర్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దృష్టి సారించి మరిపెడ మండలంలో అక్రమ రేషన్ బియ్యం దందాను అరికట్టాలని సిపిఐ మరిపెడ మండలం తరపున తెలియజేస్తున్నాను లేనిపక్షంలో దశలవారీగా ప్రయా ఉద్యమాలను కొనసాగిస్తా ఢిల్లీ పర్యటన లో ఉన్న సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ ఒక ప్రతి పత్రిక ప్రకటన చరవాణి ద్వారా తెలియజేశారు



