NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 12:29 pm Posted by : NAMASTHE BHARAT

తొర్రూరు డిఎంగా ప్రసూన లక్ష్మి

తొర్రూరు డిఎంగా ప్రసూన లక్ష్మి

నమస్తే భారత్ :-తొర్రూరు

తొర్రూరు ఆర్టీసీ డిఎం గా కె. ప్రసూన లక్ష్మి నియమితులయ్యారు.ఈ మేరకు ఆర్టీసీ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో డిఎం గా ప్రసూన లక్ష్మీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డిఎం గా పనిచేసిన పద్మావతి తార్నాక ఆర్టీసీ ఆసుపత్రి పిఓగా బదిలీపై వెళ్లారు. నూతన డిఎంకు సహచర సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిఎం మాట్లాడుతూ.ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తానని, డిపో ఆదాయం పెంచేందుకు సిబ్బంది సహకారం అందించాలని కోరారు. డిమాండ్ ను బట్టి అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తొర్రూరు డిపోను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.