*తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా12 వ మహాసభలను జయప్రదం చేయండి*

**షాద్ నగర్ డివిజన్ కన్వీనర్ శ్రీను నాయక్ **
నమస్తే భారత్ షాద్ నగర్ జూన్13: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా 12వ మహాసభలు షాద్ నగర్ పట్టణంలో రేపు జూన్ 14 నిర్వహిస్తున్నట్టు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం షాద్నగర్ డివిజన్ కన్వీనర్ శ్రీను నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయ కార్మిక సంఘంలో ఆధ్వర్యంలో చేసిన పోరాటాలను విశ్లేషించుకుని భవిష్యత్తు కర్తవ్యాలను మహాసభలో రూపొందించుకుంటామని అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై తమ సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామన్నారు.